Tumgik
#RukmaVimana
datenarche · 8 months
Link
0 notes
praveenmohantelugu · 1 year
Video
youtube
మొదటి విమానాన్ని కనిపెట్టిన భారతీయుడు! ఉద్దేశపూర్వకంగా చరిత్రను కప్పేసిన బ్రిటిషులు..
Hey guys, గాలిలో ఎగిరే విమానాల గురించి మన పురాతన భారతీయ గ్రంథాలలో చెప్పబడ్డాయని మనందరికీ బాగానే తెలుసు, కానీ ఈ వీడియోలో నేను మీకు డాక్యుమెంట్ చేసిన చరిత్రను చూపించబోతున్నాను, అప్పట్లో ఒక విమానం నిజంగానే ఎగురగలిగింది, దానికి బ్రిటిష్ ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ సాంకేతికతను పూర్తిగా అణిచివేసింది. రైట్ బ్రదర్స్ తమ మొదటి విమానాన్ని ఎగరవేయడానికి ఎనిమిది సంవత్సరాల ముందు, అంటే 1895 సంవత్సరంలో, శివకర్ బాపూజీ తల్పాడే అనే వ్యక్తి భారతదేశంలోని వేలాది మంది ప్రజల ముందు మనుషులు లేని విమానాన్ని ఎగురవేశాడు. 
కానీ నిజంగా interesting విషయమేంటంటే, ఆయన ఇప్పట్లో ఉన్న physics తర్వాత aviation టెక్నాలజీ అంటే విమానయాన పద్ధతులు లాంటి వాటి మీద ఆధారపడలేదు, కానీ ఆయన ఈ ఎగిరే యంత్రాన్ని పూర్తిగా ప్రాచీన భారతీయ గ్రంథాలను ఆధారంగా చేసుకుని రూపొందించాడు. శివకర్, 1864లో ముంబైలో జన్మించాడు ఇంకా ఆయన అప్పుడే అతి మేధావిగా ఉన్నాడు. 30 ఏళ్లు నిండకుండానే పిహెచ్‌డి పట్టాన్ని సంపాదించాడు. ఆయనకు 15 సంవత్సరాల వయస్సులో, సుబ్బరాయ శాస్త్రి అనే వృద్ధుడితో సమావేశమయ్యాడు, ఈయన తన జీవితమంతా విమానాలను పరిశోధింస్తున్నారు. దాని తరువాత ఆయన ఎగిరే యంత్రాల గురించి 'విమానక శాస్త్రం' అనే ఒక పుస్తకాన్ని వ్రాసాడు. వారిద్దరూ 15 సంవత్సరాలు కలిసి పనిచేశారు మరియు కేవలం ఎగరడం మాత్రమే కాకుండా, ఒక రకమైన రిమోట్ కంట్రోల్ పరికరంతో నియంత్రించగలిగే ఒక విమానాన్ని కూడా నిర్మించారు. 
అలాగైతే ఈ విమానం నిజంగానే ఎగిరిందా? మొట్టమొదటి విమానాన్ని ముంబై బీచ్‌లో వేలాది మంది ప్రజల సమక్షంలో దీన్ని పరీక్షించారు మరియు ఈ మనుషులు లేని విమానం 1500 అడుగుల ఎత్తుకు చేరుకుంది ఇంకా అది కూలిపోవడానికి ముందు సుమారు 37 సెకన్ల పాటు ఆ విమానం గాలిలో ఎగిరి కింద పడిపోయింది. ఇప్పుడు U.S.లోని రైట్ బ్రదర్స్ యొక్క మొదటి విమానంతో దీన్ని compare చేసి చూద్దాం, వాళ్ళ మొదటి విమానం కేవలం 120 అడుగుల ఎత్తుకు మాత్రమే చేరుకుంది తర్వాత అది 12 సెకన్ల మాత్రమే ఎగిరి కింద పడి crash అయింది. ఈ రైట్ బ్రదర్స్ కు మొదటి విమాన ప్రయాణం తర్వాత 25,000 డాలర్లతో నిధులు ఇచ్చి సన్మానించిన అదే సమయకాలంలో, శివకర్ మరియు శాస్త్రి గారిని పనికిమాలిన యంత్రాలను సృష్టించే భూటకస్తులు అని భారతదేశంలో నిందించారు. గుర్తుంచుకోండి, అప్పుడు భారతదేశాన్ని బ్రిటిష్ ఆక్రమించిన సమయం, అంతే కాకుండా జాత్య అహంకారం త్రీవ్రంగా వ్యాపించింది. 
కానీ భారతదేశంలో చేసిన ఈ మొదటి విమానం క్రాష్ అయిన తర్వాత, దాని లక్షణాలను మెరుగుపరచడానికి, మెర్క్యురీ అయాన్ల ద్వారా ఇంధనంగా ఉండే ఒక కొత్త విమాన డిజైన్‌ను రూపొందించడానికి ప్రయత్నించాడు శివకర్. ఇంకా అతను నిధులను పొందడానికి చాలా తీవ్రంగా ప్రయత్నించాడు, కానీ వాస్తవంగా అందరూ దాన్ని తిరస్కరించారు, ఏదేమైనప్పటికీ తన స్వంత ఇంట్లోనే mercury ఇంజిన్‌ను సృష్టించారు. కానీ ఎలాంటి protective gear లేకపోవడం వల్ల, శివకర్ ని mercury యొక్క విషవాయువు దెబ్బతీసింది, దాని వల్ల ఆయన మానసికంగా  చాలా దెబ్బతిన్నాడు ఇంకా భ్రమించే వారిగా మారాడు. ఈ విషయం వ్యాప్తి చెందడంతో, బ్రిటీష్ ప్రభుత్వం ఆయన పేలుడు పదార్థాలను తయారు చేశారని చెప్పి, ఆయన యొక్క కొత్త విమానాన్ని స్వాధీనం చేసుకున్నారు శివకర్ యొక్క మెర్క్యురీ అయాన్ ఇంజిన్‌ను వివరించడానికి ప్రయత్నించినప్పుడు లాయర్లు, judge లు అతనిని చూసి నవ్వారు మరియు అలాంటి యంత్రం ఎప్పటికీ పనిచేయదని కూడా చెప్పారు. 
ఒక expert scientists teamని రప్పించి, mercuryతో నడిచే ఇలాంటి పరికరాలు సాధ్యం కానివి అని చెప్పి అందరూ ఒప్పుకునేలా నమ్మించారు. ఇక్కడ shocking ఏంటంటే, ఇప్పట్లో, NASA అంతరిక్ష ప్రయాణం కోసం mercury ion ఇంజిన్‌లను ఉపయోగిస్తుంది మరియు ఈ అయాన్ ఇంజిన్‌లు ఒక స్థిరమైన వేగాన్ని అందించగలవని బహిరంగంగా ఒప్పుకున్నారు, అంతరిక్ష నౌక ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది, ఇంకా దాని వేగం అధిగమించడం మాత్రమే కాకుండా ఆ పూర్తి ఇంజిన్ యొక్క size ని తగ్గిస్తుంది. శివ్‌కర్‌ను జైలులో వేసి బంధించి కొన్ని సంవత్సరాల తర్వాత ఇలాంటి యంత్రాలను, ఇకపై నువ్వు తయారు చేయకూడదని, ఖండించి విడుదల చేశారు. ఏదేమైనప్పటికీ, ఆయన తన పట్టుదలను వదలకుండా రుక్మ విమానం అనే మరో విమానాన్ని రహస్యంగా సృష్టించాడు. 
ఈ గంట ఆకారపు విమానాన్ని 1930లలో రహస్యంగా జర్మనీకి తీసుకెళ్లారు మరియు వాళ్ళు దాన్ని కొంచం modified చేసి "Nazi Bell" అనే ఒక పరికరాన్ని సృష్టించారనే పుకారు ఉంది. రుక్మ విమానం మరియు నాజీ బెల్ కు మధ్య ఉన్న similarityను మీరు స్పష్టంగా చూడవచ్చు. ఇందులో విచిత్రమేంటంటే, బెల్ ఆకారాలలో ఉన్న UFOలు ప్రపంచవ్యాప్తంగా అనేకసార్లు కనిపించాయి మరియు అలాంటి UFO ఒకటి Pennsylvaniaలోని Kecksburg అనే నగరంలో క్రాష్ అయింది. దాదాపు 500 సంవత్సరాలకు ముందు ఎగిరే యంత్రాల గురించి డా విన్సీ మొదటిసారిగా వ్రాసాడని చాలా మంది అనుకుంటున్నారు, అయితే భారతీయ గ్రంథాలు మరియు శిల్పాలు కనీసం 2000 సంవత్సరాలకు ముందు ఈ ఎగిరే పరికరాలకు సంబంధించిన ఆశ్చర్యకరమైన ఆధారాలను మనకు చూపుతున్నాయి.
- Praveen Mohan Telugu
1 note · View note