Tumgik
#మానసనవ్య
batukamma · 4 years
Text
అత్తావారింటికి వెళ్తూ అనంత లోకాలకు..
Tumblr media
పెళ్లి అయి వారం కాకముందే ఓ నవ జంటను మృత్యువు బలితీసుకుంది.. పెళ్లి అత్తారింటికి వెళ్తున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు మృతి చెందారు.. ఈ విషాదకర ఘటన పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం పూళ్ల గ్రామం హైవే వద్ద చోటు చేసుకుంది.. ఇక వివరాల్లోకి వెళితే యడ్లపల్లి వెంకటేష్ కి (30) ఆలపాటి మానస నవ్యకి(26) ఈనెల 14న వివాహం జరిగింది.. అనంతరం ఈ నెల 16 న ఆ నవ దంపతులు విశాఖపట్నం జిల్లా సబ్బవరానికి కారులో డ్రైవర్ సహాయంతో బయలుదేరారు.. ఇందులో పెళ్లి కుమార్తె తమ్ముడు భరత్ కూడా ఉన్నాడు.. ఇంతలో పూళ్ళ హైవై వద్ద ఎదురుగా వస్తున్న లారీని కారు ఢీకొట్టడంతో కారు గాల్లోకి లేచి నుజ్జు నుజ్జు అయింది. నిహారికకి కాబోయే భర్త ఎవరో తెలుసా? కేసీఆర్ గారూ ఏంటీ ఈ దుర్మార్గం.. ఇంత వివక్ష ఎందుకు..? దీనితో డ్రైవర్ తో పాటు ఇద్దరు నవ దంపతులు కూడా అక్కడికక్కడే మృతి చెందారు..భరత్ గాయాలతో బయటపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. తమ పిల్లల భవిష్యత్తు ఎంతో బంగారంగా ఉంటుంది అనుకుంటే పెళ్ళైనా కొద్దీ రోజులకే తమ బిడ్డలు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఆ ఇరువురి కుటుంబాలలో విషాదం నెలకొంది. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందో తెలియాల్సి ఉంది.. డ్రైవర్ నిద్రపోవడం వల్ల ఈ సంఘటన జరిగిందా లేక మరేమైనా ఉందా అనేది తెలియాల్సి ఉంది.. అయితే పెళ్లి కుమార్తె మానస నవ్య సోదరుడు భరత్ చెప్తున్న వివరాల ప్రకారం.. ఒక లారీ తమ కారును పక్కనుంచి బలంగా ఢీకొట్టటంతో తమ కారు గాలిలో ఎగురుతూ డివైడర్‌ దాటి అటువైపు దూసుకుపోయిందని చెప్తున్నాడు.. ప్రస్తుతం పోలీసులు దీనిపైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ పొందడానికి మా టెలిగ్రామ్ ని ఫాలో అవ్వండి! Read the full article
0 notes